News December 15, 2024

పాకిస్థాన్‌పై భారత్ విజయం

image

మహిళల అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 67 పరుగులే చేసింది. భారత బౌలర్ సోనమ్ యాదవ్ 4 వికెట్లు తీశారు. ఛేదనలో భారత్ 73 బంతులుండగానే జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్ కమలిని 29 బంతుల్లో 44* పరుగులు చేశారు.

Similar News

News November 21, 2025

పాడేరు: దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు

image

జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం మూడు చక్రాల మోటార్ వాహనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కే. కవిత తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున వాహనాలు అందిస్తారు. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 25వ తేదీలోగా www.apdascac.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News November 21, 2025

పాడేరు: దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు

image

జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం మూడు చక్రాల మోటార్ వాహనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కే. కవిత తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున వాహనాలు అందిస్తారు. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 25వ తేదీలోగా www.apdascac.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News November 21, 2025

పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు మందపోరు

image

పల్నాడు వీరుల ఉత్సవాలలో మూడవ రోజు శుక్రవారం మందపోరు నిర్వహించనున్నారు. మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల మండాది ప్రాంతంలో ఆవులను మేపేవారు. కుట్రతో నాగమ్మ వర్గీయులు ఆవులను వధిస్తారు. ఆవులు రక్షించుకునేందుకు లంకన్న భీకర యుద్ధం చేసి వీర మరణం పొందుతాడు. దీంతో బ్రహ్మనాయుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నాడు కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన చాప కూడు సిద్ధాంతం నేటికీ కొనసాగుతోంది.