News October 28, 2024

విదేశాలకు ఇండియా వెపన్స్.. NEXT టార్గెట్ ఇదే!

image

డిఫెన్స్ రంగంలో ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలను ఇస్తోంది. 2023-24లో భారత్ రూ.21,083 కోట్ల విలువైన ఆయుధాలను <<14471733>>ఎగుమతి<<>> చేసింది. ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్న డిఫెన్స్ ప్రొడక్షన్ 2028-29 నాటికి రూ.3 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.50వేల కోట్లకు పెంచాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 16 PSUలు, 430 కంపెనీలు, 16000 SMEలతో ఇండస్ట్రీని విస్తరించింది. ప్రైవేటు కంట్రిబ్యూషన్‌ను 21%కు పెంచింది. దీనిపై మీ కామెంట్!

Similar News

News October 24, 2025

ప్రమాద స్థలికి వెళ్లాలని కలెక్టర్, SPకి రేవంత్ ఆదేశం

image

చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది HYDలో ఎక్కిన ప్యాసింజర్లు ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలన్నారు.

News October 24, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

*త్వరలో ‘సమగ్ర లైఫ్ సైన్సెస్’ పాలసీ.. 2030కల్లా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా రోడ్ మ్యాప్: మంత్రి శ్రీధర్ బాబు
*గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్‌ డైలీవేజ్ వర్కర్లకు తగ్గించిన జీతాలు చెల్లిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ
*నాపై KTR చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు
*రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి, ఉత్పత్తి చేసేలా ప్లాంట్ ఏర్పాటుకు NFTDC సంస్థతో సింగరేణి ఒప్పందం

News October 24, 2025

చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

image

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమంతో మసాజ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.