News October 11, 2025
2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI

AI టెక్నాలజీ కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఇక మనదేశానికి ఉండదు. ఎందుకంటే స్వదేశీ AI 2026 ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ ఏడాది చివరికి మన సొంత ఏఐ సాంకేతికత పూర్తవుతుందని, ఆపై అందుబాటులోకి వస్తుందని MeitY సెక్రటరీ కృష్ణన్ తెలిపారు. ‘38వేల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPU)తో ఉండే ఈ ఏఐతో కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగుపడుతుంది. ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0లో ఇది కీలకమవుతుంది’ అని తెలిపారు.
Similar News
News October 11, 2025
నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్: CBN

AP: నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్శాఖపై సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా మద్యం బాటిల్పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఫైరయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని తెలిపారు.
News October 11, 2025
టాప్-100 కుబేరుల్లో తెలుగు వారు ఎవరంటే?

ఫోర్బ్స్ ఇండియా <<17957747>>జాబితాలో<<>> దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి(రూ.88,000 కోట్లు) 25వ స్థానంలో ఉన్నారు. మేఘా ఇంజినీరింగ్ చీఫ్స్ పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 70వ స్థానంలో, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ సి.రెడ్డి 86వ, హెటిరో గ్రూప్ ఛైర్మన్ పార్థసారథి 89వ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత సతీష్ రెడ్డి 91వ స్థానంలో ఉన్నారు.
News October 11, 2025
రిమాండ్ రిపోర్ట్: మద్యం బాటిళ్లకు ఫినాయిల్ స్టిక్కర్లు!

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టైన <<17969515>>జనార్దన్రావు<<>> రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ‘నిందితుడు 2012లో మద్యం వ్యాపారం స్టార్ట్ చేసి కరోనాతో ఆర్థికంగా నష్టపోయాడు. 2021 నుంచి HYDలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో లిక్కర్ పోసి డౌట్ రాకుండా ఫినాయిల్ స్టిక్కర్లు వేసేవాడు. ఆపై ఇబ్రహీంపట్నం ANR బార్కు తెచ్చి విక్రయించేవాడు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.