News July 5, 2024
AUG 16 నుంచి ముంబైకి ఇండిగో సర్వీస్

AP: విజయవాడ ఎయిర్పోర్టు-ముంబైకి ఆగస్టు 16 నుంచి ఇండిగో సర్వీసులు నడపనుంది. రోజూ సా.6.30కు ముంబై నుంచి విమానం బయలుదేరి రా.8.20కి గన్నవరం చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు ఇక్కడ బయలుదేరి రా.11కు ముంబైలో ల్యాండ్ అవుతుంది. ఈ సర్వీస్ వల్ల ముంబైతోపాటు గల్ఫ్, UK, USA వెళ్లే ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ రూట్లో ఇప్పటికే ఎయిరిండియా సర్వీసులు నడుపుతోంది.
Similar News
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.
News November 25, 2025
మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.


