News June 29, 2024
ఇందిరా మమ్మల్ని జైలులో పెట్టినా హింసించలేదు: లాలూ ప్రసాద్

ఎమర్జెన్సీ సమయంలో మాజీ PM ఇందిరా గాంధీ తమను జైలులో పెట్టినా హింసించలేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ‘ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975’ పేరుతో రాసిన ఆర్టికల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో తాను 15 నెలల పాటు జైలులో ఉన్నానని తెలిపారు. ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఎలా ఉందో.. ఇప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవించకపోవడమూ అటువంటి మచ్చే అని మరచిపోకూడదని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.
News February 11, 2026
ఫిబ్రవరి 11: చరిత్రలో ఈరోజు

1847: అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం
1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1942: బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ మరణం
1974: సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం (ఫొటోలో)
1977: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం
News February 11, 2026
అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.


