News December 2, 2024

ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఓపెన్: మంత్రి

image

TG: ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేస్తాం. ప్రతి గ్రామానికి అధికారుల బృందాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

Similar News

News March 26, 2026

మార్కాపురం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

image

AP: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2లక్షలు.. గాయపడ్డ వారికి ₹50వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు సహకారం అందించాలని సీఎస్‌ను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సంతాపం తెలిపిన జగన్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News March 26, 2026

దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

image

TG: 2024, 2025 దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు 44 కంపెనీలతో MOU చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సంస్థల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉందని అసెంబ్లీలో తెలిపారు. వీటివల్ల 68,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని చెప్పారు. ‘రూ.81,800 కోట్ల పెట్టుబడికి సంబంధించి 6 కంపెనీలకు భూములు కేటాయించాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం సమకూరింది’ అని వివరించారు.

News March 26, 2026

‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా తీస్తున్నా: వివేక్ అగ్నిహోత్రి

image

పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ కథాంశంతో సినిమాను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ఈ చిత్రాన్ని T-సిరీస్ నిర్మిస్తుందని తెలిపారు. ‘ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరమైన కథలను చెప్పడానికి నేను సిద్ధం. ధైర్యం, స్పష్టత, ప్రొఫెషనలిజమ్‌తో సినిమాలు తీయడానికి ప్రాధాన్యం ఇస్తా. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కల్పించడానికే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు.