News December 24, 2024
ఇందిరమ్మ ఇళ్లు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదా కాదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలని, ఆ తర్వాతే యాప్లో వివరాల్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. యాప్లో నమోదు చేసిన వివరాలపై 360 డిగ్రీల సాఫ్ట్వేర్తో మరోసారి పరిశీలన ఉంటుందన్నారు.
Similar News
News November 16, 2025
Infosys ఉద్యోగులకు 75% బోనస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. SEP త్రైమాసికానికి సగటున 75% బోనస్ ప్రకటించింది. ఔట్స్టాండింగ్ పనితీరు కనబర్చిన వారికి 83%, ఉత్తమ పనితీరు ప్రదర్శించిన వారికి 78.5%, అంచనాలు అందుకున్నవారికి 75% లభించనుంది. గతంలో కంటే 7-8% తగ్గినప్పటికీ అన్ని కేటగిరీల్లో సగటున 70.5%-83% అందనుంది. లెవల్ 4, 5, 6లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లకు ఈ బోనస్ లభిస్తుంది.
News November 16, 2025
ఇండియా-A ఘన విజయం

రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్కోట్లో జరగనుంది.
News November 16, 2025
TG న్యూస్ రౌండప్

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు


