News December 24, 2024

ఇందిరమ్మ ఇళ్లు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదా కాదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలని, ఆ తర్వాతే యాప్‌లో వివరాల్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. యాప్‌లో నమోదు చేసిన వివరాలపై 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తో మరోసారి పరిశీలన ఉంటుందన్నారు.

Similar News

News November 18, 2025

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.

News November 18, 2025

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.

News November 18, 2025

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కాగా సతీశ్ మృతి కేసును తాజాగా హత్య కేసుగా నమోదుచేసిన విషయం తెలిసిందే.