News September 12, 2025
మా హయాంలో పరిశ్రమలు వెళ్లిపోలేదు: సజ్జల

తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారంగా Way2News కాన్క్లేవ్లో కొట్టిపారేశారు. లులూ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపించాయని చెప్పడంతో అదేమైనా ఉపాధి కల్పించే ఇండస్ట్రీయా అని ప్రశ్నించారు. కొవిడ్ రాకపోయుంటే తాము మరింత మెరుగ్గా పనిచేసేవాళ్లమని, మరింత ఆర్థిక వృద్ధి సాధించేవాళ్లమని చెప్పారు.
Similar News
News September 12, 2025
ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. ప్రజలకు సీఎం పిలుపు

AP: ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘పోషకాహారం తినాలి. రోజూ గంట వ్యాయామం చేయాలి. రాత్రి వేళల్లో వెంటనే నిద్రపోవాలి. నా కుటుంబానికి హెరిటేజ్ ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు. పూర్తి దృష్టి ప్రజలపైనే ఉంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. P-4తో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా జీవిత ఆశయం’ అని వే2న్యూస్ కాన్క్లేవ్లో పేర్కొన్నారు.
News September 12, 2025
2026 నాటికి క్వాంటమ్ వ్యాలీ పూర్తి: చంద్రబాబు

AP: తెలుగుజాతి అన్నింట్లో నం.1గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని Way2News Conclaveలో CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘2026 నాటికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పూర్తవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అందిస్తామని చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచానికి మనం క్వాంటమ్ కంప్యూటర్స్ సరఫరా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో అన్నీ సాధ్యమే. మనమూ ప్రపంచానికి పెద్ద పెద్ద ఉత్పత్తులను సరఫరా చేసే పరిస్థితి వస్తుంది’ అని తెలిపారు.
News September 12, 2025
APPLY NOW: బీటెక్ అర్హతతో 976 ఉద్యోగాలు

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి B.Arch, B.Tech/BE/MCA పూర్తిచేసి, GATEలో అర్హత సాధించి ఉండాలి. వయసు 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి మినహాయింపు ఉంటుంది. ఎంపికైన వారికి రూ.40వేలు-1.40 లక్షల జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు https://aai.aero/ వెబ్సైట్లో చూడగలరు.
#ShareIt