News October 9, 2024

INDvsBAN: కొట్టేస్తారా? ఛాన్సిస్తారా?

image

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో 2వ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈనెల 6న జరిగిన తొలి T20లో భారత్ గెలిచింది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. బంగ్లా గెలిస్తే సిరీస్ 1-1గా మారి 3వ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈనేపథ్యంలోనే నేటి మ్యాచ్‌లో గెలవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి భారత్ గెలిచి సిరీస్ వశం చేసుకుంటుందా? లేక బంగ్లాకు ఛాన్స్ ఇస్తుందా? వేచి చూడాలి. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభం.

Similar News

News January 18, 2026

APPLY NOW: SAILలో ఉద్యోగాలు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>)కు చెందిన బర్న్‌పుర్ హాస్పిటల్‌లో 22కన్సల్టెంట్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, పీజీ డిప్లొమా/పీజీ డిగ్రీ/DNB/DM/MCh/DrNB/DIH అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sailcareers.com/

News January 18, 2026

అరటి పండ్ల విషయంలో గొడవ.. హిందూ వ్యాపారిని కొట్టిచంపారు!

image

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. ‘ఘాజీపూర్‌లో లిటన్ చంద్ర ఘోష్ (55) హోటల్ నిర్వహిస్తున్నాడు. మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. ఈ క్రమంలో తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. లిటన్ హోటల్ వద్ద అవి కనిపించడంతో మాసుమ్‌, అతడి తల్లిదండ్రులు స్వాపన్, మాజేదా వాగ్వాదానికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. ముగ్గురినీ అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.

News January 18, 2026

ప్రజా దర్బార్ ప్రాముఖ్యత మీకు తెలుసా?

image

నాగోబా జాతరలో ప్రజా దర్బార్ కీలకమైన ఘట్టం. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. పూర్వం గిరిజనులు తమ గోడును రాజులకు చెప్పుకోవడానికి ఈ దర్బార్‌ను వేదికగా చేసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం సాగుతోంది. జాతరలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారు. గిరిజనులు తమ భూమి, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలను వివరించి పరిష్కారం కోరుతారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది.