News September 27, 2024
INDvsBAN: స్టేడియంలో కొండముచ్చులతో భద్రత!
ఇండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టును చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను కోతుల నుంచి రక్షించేందుకు గ్రీన్ పార్క్ స్టేడియం నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కోతులు ప్రేక్షకుల మొబైల్స్, ఆహారం, ఇతర వస్తువులను దొంగిలిస్తుండేవి. ఈ క్రమంలో కోతులను తరిమేలా కొండముచ్చులను బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం స్టేడియంలో కొండముచ్చులు భద్రతనిస్తున్నాయి.
Similar News
News September 27, 2024
డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు ఇబ్బంది ఏంటి?: సీఎం
AP: బైబిల్ చదువుతానని చెప్పిన YS జగన్కు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎన్నో ఏళ్లుగా డిక్లరేషన్ అనేది ఉంది. CMగా ఉన్నప్పుడు ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. అప్పుడు చేసినట్లుగా ఇప్పుడూ చేస్తానంటే ఎలా? చట్టాలు, సంప్రదాయాలను గౌరవించడంలో సీఎం మొదటి వ్యక్తిగా ఉండాలి’ అని సీఎం సూచించారు.
News September 27, 2024
అగ్నివీర్లకు శుభవార్త చెప్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్
కనీసం 15% టెక్నికల్ ఖాళీలను అగ్నివీర్లకు రిజర్వ్ చేస్తున్నట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. అలాగే, ఔట్సోర్సింగ్ కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ విభాగాల్లో 50% ఖాళీలను వీరి ద్వారా భర్తీ చేయనుంది. సాయుధ దళాలలో 4 ఏళ్ల సేవ తర్వాత అగ్నివీర్లు తమ తమ రంగాలలో నైపుణ్యంతో పాటు లోతైన క్రమశిక్షణ, జాతీయవాదాన్ని పెంపొందించుకుంటారని సంస్థ డిప్యూటీ CEO Dr. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.
News September 27, 2024
NDDB రిపోర్టును తప్పుబడతారా?: సీఎం చంద్రబాబు
AP: తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని జగన్ అబద్ధాలు చెబుతున్నారని CM చంద్రబాబు విమర్శించారు. ‘ఏఆర్ డెయిరీ 8 ట్యాంకర్ల నెయ్యిని పంపింది. 4 ట్యాంకర్లను సిబ్బంది వాడారు. 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. ఆ కంపెనీపై ఆరోపణలు రావడంతో NDDBకి పంపారు. వాళ్లు ఇచ్చిన రిపోర్టును జగన్ తప్పుపడుతున్నారు. తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తే సంప్రోక్షణ చేస్తారు. అందుకే ఈ నెల 23న అర్చకులు శాంతి యాగం చేశారు’ అని పేర్కొన్నారు.