News April 1, 2025
INDvsENG: ప్రతిష్ఠాత్మక ట్రోఫీకి రిటైర్మెంట్!

ప్రతిష్ఠాత్మక పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్లో జరిగే టెస్టు సిరీస్ను 2007 నుంచి పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహిస్తోంది. ఇకపై ఇరు దేశాల్లోని ఇతర దిగ్గజాల పేరిట సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూన్-జులై మధ్య జరిగే సిరీస్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశముంది. IND తరఫున 46 టెస్టులు ఆడిన పటౌడీ 2011లో మరణించారు.
Similar News
News October 22, 2025
రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.
News October 22, 2025
RMLIMSలో 422 నర్సింగ్ పోస్టులు

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (RMLIMS) 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో దరఖాస్తు లింక్ ఓపెన్ కానుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drrmlims.ac.in/
News October 22, 2025
నిందితుడికి మా పార్టీలో ఏ పదవీ లేదు: TDP

AP: కాకినాడ(D) తునిలో స్కూల్ నుంచి బాలికను తోటలోకి తీసుకెళ్లిన <<18071366>>ఘటనపై<<>> టీడీపీ స్పందించింది. ‘సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలోనూ నిందితుడికి ఏ పదవీ లేదు. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు’ అని ట్వీట్ చేసింది.