News January 21, 2025
రేపటి నుంచి INDvsENG టీ20 సిరీస్

భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. రేపు తొలి మ్యాచ్ కోల్కతా వేదికగా రా.7 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, హాట్ స్టార్ యాప్లో లైవ్ చూడవచ్చు. తర్వాతి మ్యాచులు ఈనెల 25 (చెన్నై), 28 (రాజ్కోట్), 31 (పుణే), ఫిబ్రవరి 2(ముంబై) తేదీల్లో జరగనున్నాయి. 3 మ్యాచుల వన్డే సిరీస్ (నాగ్పూర్, కటక్, అహ్మదాబాద్) FEB 6 నుంచి జరగనుంది.
Similar News
News November 17, 2025
హసీనాకు మరణశిక్ష.. స్పందించిన భారత్

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించడంపై భారత్ స్పందించింది. ‘పొరుగు దేశ ప్రజల ప్రయోజనాలకు IND కట్టుబడి ఉంటుంది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం నెలకొల్పేందుకు సహకారం అందిస్తాం’ అని పేర్కొంది. కాగా బంగ్లా అల్లర్ల తర్వాత భారత్కు పారిపోయి వచ్చిన హసీనాకు కేంద్రం ఆశ్రయం కల్పించింది. అయితే ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరుతోంది.
News November 17, 2025
హసీనాకు మరణశిక్ష.. స్పందించిన భారత్

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించడంపై భారత్ స్పందించింది. ‘పొరుగు దేశ ప్రజల ప్రయోజనాలకు IND కట్టుబడి ఉంటుంది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం నెలకొల్పేందుకు సహకారం అందిస్తాం’ అని పేర్కొంది. కాగా బంగ్లా అల్లర్ల తర్వాత భారత్కు పారిపోయి వచ్చిన హసీనాకు కేంద్రం ఆశ్రయం కల్పించింది. అయితే ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరుతోంది.
News November 17, 2025
డిసెంబర్లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.


