News January 31, 2026
INDvsPAK.. రేపే డూ ఆర్ డై మ్యాచ్

U19 WCలో రేపు ZIM వేదికగా IND, PAK తలపడనున్నాయి. ఇప్పటికే మూడు జట్లు (AUS, AFG, ENG) సెమీస్ చేరాయి. మిగిలిన స్థానం కోసం IND, PAK మధ్య పోటీ ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో IND 6, PAK 4 పాయింట్లతో ఉన్నాయి. టీమిండియా రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. దీంతో PAK సెమీస్ చేరాలంటే 105 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ అయితే 251 పరుగులను 29.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.
Similar News
News February 13, 2026
ఆలస్యంగా వరి నాట్లు.. కలుపు నివారణ

ఆలస్యంగా వరి నాటిన పొలంలో 15-20 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు ఉన్నట్లు గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో సైహలోపాప్ బ్యుటైల్ 10% ఇ.సి 400ml ద్రావణం లేదా బిస్ఫైరిబాక్ సోడియం 10% S.C ద్రావణం 80ML కలిపి పిచికారీ చేయాలి. అదే అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉంటే నాటిన 20-25 రోజుల వేళ 200 లీటర్ల నీటిలో ఎకరాకు 2,4 డి.సోడియం సాల్ట్ 80% పొడి 400 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 13, 2026
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..

TG: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేస్తారు. 25 బ్యాలెట్ పత్రాల చొప్పున బండిల్ చేసి వెయ్యి ఓట్ల(ఒక రౌండ్)ను ఒక కట్టగా ఉంచుతారు. ఓట్లను బట్టి రౌండ్ల వారీగా ప్రతీ బ్యాలెట్ పేపర్ను ఏజెంట్కు చూపిస్తూ లెక్కింపు సాగుతుంది. చివరకు ఫలితాలు ప్రకటిస్తారు.
* ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు Way2Newsను ఫాలో అవ్వండి.
News February 13, 2026
శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు

శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 16 వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 24 గంటలు రాకపోకలకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2.59 లక్షలకు పైగా భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 3వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.


