News February 23, 2025
INDvsPAK: దుబాయ్లో బుమ్రా సందడి

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ను వీక్షించేందుకు భారత స్టార్ బౌలర్ బుమ్రా దుబాయ్ స్టేడియానికి వచ్చారు. ఐసీసీ టీ20, టెస్ట్ టీమ్ క్యాపులు, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డులు అందుకున్నారు. అనంతరం టీమ్ ఇండియా ప్లేయర్లతో కాసేపు ముచ్చటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాల్సిన ఆయన గాయం కారణంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.
Similar News
News February 23, 2025
ఐసీసీ ఛైర్మన్తో మంత్రి లోకేశ్ భేటీ

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్లో ఐసీసీ ఛైర్మన్ జైషాతో భేటీ అయినట్లు AP మంత్రి లోకేశ్ తెలిపారు. ‘జైషాను కలవడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంపై ఆయనతో చర్చించా. మా ఇద్దరికీ ఇది చాలా ఇష్టమైన అంశం’ అని జైషాతో తీసుకున్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు. ఈ మ్యాచుకు తన కొడుకు దేవాన్ష్ను కూడా ఆయన తీసుకెళ్లారు.
News February 23, 2025
ఆ జిల్లాల్లో 3 రోజులు వైన్ షాపులు బంద్

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ADB, కరీంనగర్, వరంగల్, NLG, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
News February 23, 2025
పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.