News September 22, 2025
INDvsPAK.. మూడోసారి తలపడే అవకాశం?

ఆసియాకప్ 2025లో పాకిస్థాన్తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో PAKపై భారత్ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20WC నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.
Similar News
News September 22, 2025
‘SIR’ అమలుకు ఈసీ ఆదేశాలు

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను అక్టోబర్-నవంబర్లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపింది. ఇప్పటికే బిహార్లో SIR అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.
News September 22, 2025
అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. NDAలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు BJP మద్దతు ఇస్తోంది. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ కేంద్రం బిహార్కు పెద్దపీట వేస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
News September 22, 2025
నవరాత్రి ఉత్సవాలు షురూ..

దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు.