News May 30, 2024
INDvsPAK మ్యాచ్కు ఉగ్ర ముప్పు!

న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనున్న భారత్, పాక్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో అలజడి సృష్టించే అవకాశం ఉండటంతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నాసౌ కౌంటీ పోలీస్ కమిషనర్ పాట్రిక్ తెలిపారు. డ్రోన్ దాడులకూ అవకాశం ఉన్నందున మ్యాచ్ జరుగుతున్న ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. మరోవైపు ఈ మ్యాచ్కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యూయార్క్ గవర్నర్ ఆదేశాలిచ్చారు.
Similar News
News February 20, 2026
రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్వీర్ సింగ్కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News February 20, 2026
పురుగు మందులను కొంటున్నారా?

పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందులను కొనేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఒకే మందు పొడి మందుగాను, నీటిలో కరిగే ద్రావణంగాను, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను అనుసరించి నిపుణుల సూచనతో మందును కొనాలి. షాపు యజమాని నుంచి రసీదును తప్పక తీసుకోవాలి. కొనేమందు పురుగుల మందు డబ్బా గడువు తేదీని చూసి తీసుకోవాలి.


