News June 10, 2024
లాహోర్లో INDvsPAK మ్యాచ్!

టీ20 WC తర్వాత 8 నెలలకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2025 FEB 19-MAR9 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం లాహోర్ వేదికగా INDvsPAK మ్యాచ్ జరగనున్నట్లు CRICBUZZ పేర్కొంది. అయితే దీనికి భారత ప్రభుత్వం, బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. ఒకవేళ పాక్లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Similar News
News September 10, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నికలో 7 పార్టీల క్రాస్ ఓటింగ్?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్కు 15 మంది ఇండీ కూటమి MPలు క్రాస్ ఓటింగ్ చేశారని News18 వెల్లడించింది. ఈ మేరకు NDA వర్గాలు చెప్పాయంది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నుంచి ఐదుగురు, శివసేన(UBT) నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, DMK, JMM, RJD, NCP(SP)ల నుంచి ఒకరు చొప్పున క్రాస్ ఓటింగ్ చేసినట్లు పేర్కొంది. మరోవైపు NDA తమ MPలకు 2 రోజులు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంది.
News September 10, 2025
జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్

AP: మెడికల్ కాలేజీలపై జగన్ <<17624092>>వ్యాఖ్యలకు<<>> మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తామేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎందుకు వాటిని పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. తెలియకపోతే సలహాదారులను అడిగి తెలుసుకోవాలని చురకలు అంటించారు. PPP వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదని తెలిపారు.
News September 10, 2025
వరుస టాస్ ఓటములకు తెరదించిన టీమ్ ఇండియా

టీమ్ ఇండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. ఇవాళ ఆసియా కప్లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ వరుస టాస్ ఓటములకు తెరదించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా 15 మ్యాచ్ల్లో IND టాస్ ఓడిన విషయం తెలిసిందే. 16వ మ్యాచ్లో ఈ స్ట్రీక్కు బ్రేక్ పడింది. అటు ఇవాళ్టి మ్యాచ్లో స్టార్ బౌలర్ అర్ష్దీప్కు చోటుదక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని తనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.