News November 4, 2024
నాసిరకం EV బ్యాటరీ.. OLAకి రూ1.7 లక్షలు ఫైన్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాసిరకం బ్యాటరీలను వాడుతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సునీల్ అనే వ్యక్తి నాసిరకం బ్యాటరీపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నోటీసులిచ్చినా సంస్థ పట్టించుకోలేదు. దీంతో రూ.1.73లక్షలు జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలాను ఆదేశించింది. అతను పడిన మానసిక క్షోభకు రూ.10వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.
Similar News
News January 27, 2026
భానుచందర్ ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

సీనియర్ నటుడు భానుచందర్ లేటెస్ట్ లుక్ బయటకొచ్చింది. తాను తీస్తోన్న సినిమాలో నటించేందుకు భానుచందర్ ఓకే చెప్పారంటూ ఓ యువ డైరెక్టర్ ఇన్స్టాలో ఫొటో పోస్ట్ చేయగా వైరలవుతోంది. అందులో తెల్లటి గడ్డంతో స్లిమ్గా అయిపోయిన భానుచందర్ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిరీక్షణ సినిమాతో సినీ ప్రేమికులకు దగ్గరైన ఆయనను చాలా కాలం తర్వాత చూసి ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 73ఏళ్లు.
News January 27, 2026
వరల్డ్కప్లోకి ఇలా రావాలనుకోలేదు: స్కాట్లాండ్

T20 WC నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్కు అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్బ్లేడ్ స్పందించారు. ‘ప్రపంచకప్కు ఇలా వెళ్లాలని కోరుకోలేదు. అర్హత సాధించేందుకు ఓ ప్రక్రియ ఉంది. ఇలాంటి ఆహ్వానాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ ప్రత్యేక పరిస్థితుల మధ్య మేం టోర్నీలో అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంది. బంగ్లాకు సానుభూతి తెలుపుతున్నాం’ అని అన్నారు.
News January 27, 2026
ఇవాళ సా.4 గంటలకు ఎన్నికల షెడ్యూల్

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.


