News July 14, 2024
చొరబాటు యత్నం.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల మీదుగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. వీరిని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. చొరబాటు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
తొలి రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

వాతావరణ మార్పులతో తొలి రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బంగ్లాదేశ్కు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేల సమాచారం, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో ఒత్తిడిని పెంచి, హార్మోన్లను ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.
News September 19, 2025
సాయుధ పోరాటం ఆపబోం: మావోయిస్టులు

తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ పాటిస్తాం’ అని ఇటీవల అభయ్(సోనూ) పేరుతో లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతమంటూ మావోల అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నానని సోనూ ఎందుకు ప్రకటించాడో అర్థం కావట్లేదన్నారు. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.
News September 19, 2025
దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్!

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. APలో ఈనెల 22-OCT2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 21-OCT3 వరకు సెలవులిచ్చారు.