News July 14, 2024
చొరబాటు యత్నం.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల మీదుగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. వీరిని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. చొరబాటు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
అనకాపల్లికి సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ అనకాపల్లి(D) తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారు. బంగారయ్యపేటలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తాళ్లపాలెంలో ప్రజావేదిక సభ, ఉగ్గినపాలెంలో TDP నేతలతో భేటీ, అనకాపల్లిలో వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అటు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు Dy.CM పవన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు.
News December 20, 2025
ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరపరా?

సాధారణంగా ఏడాది పొడవునా తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. కానీ ధనుర్మాసంలో ఈ సేవకు బదులుగా ‘తిరుప్పావై’ పఠనం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిది. అందుకే ఈ నెలలో శ్రీవారిని నిద్రలేపేందుకు గోదాదేవి రచించిన దివ్య ప్రబంధ పాశురాలను వినిపిస్తారు. ఫలితంగా ఈ నెల రోజులు సుప్రభాత సేవ ఏకాంతంగా కూడా జరగదు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 20, 2025
ఎలా మాట్లాడాలంటే?

ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలను తీసుకురాకూడదంటున్నారు నిపుణులు. అలాగే ఏదైనా అంశాన్ని నిరూపించడానికి ఎక్కువ వాదించకూడదు. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పాలి. వివిధ అంశాల గురించి పైపైన టచ్ చేస్తూ చెప్పడం కంటే ఒక్క అంశాన్నే స్పష్టంగా వివరించడం మంచిది. చెప్పే సమయం కంటే, నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. కాబట్టి ఏ విషయాన్నైనా స్పష్టంగా, నాణ్యతతో తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నించాలి.


