News November 27, 2024
రష్మిక మందన్నకు గాయం!

హీరోయిన్ రష్మిక మందన్నకు గాయమైనట్లు తెలుస్తోంది. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక విమానంలో కేరళకు చేరుకున్నారు. కాగా విమానంలో రష్మిక, అల్లు అర్జున్ కూర్చొని ముచ్చటిస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఆ ఫొటోల్లో రష్మిక చేతికి పట్టీ వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆమెకు గాయం ఎలా అయ్యిందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
Similar News
News January 19, 2026
5 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని ట్వీట్ చేసింది. కాగా నవీన్ కెరీర్లో ఇదే తొలి రూ.100 కోట్ల మార్క్ మూవీ కావడం విశేషం.
News January 19, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

గువాహటిలోని <
News January 19, 2026
దావోస్కు సీఎం.. సింగపూర్ అధ్యక్షుడితో భేటీ

AP: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు. అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సమావేశం అయ్యారు. అంతకుముందు జ్యురిచ్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.


