News June 30, 2024

రైతులకు అన్యాయం జరిగితే సహించం: పెమ్మసాని

image

AP: ఖరీఫ్‌లో పంటల సాగుకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలో మాట్లాడుతూ.. కృత్రిమంగా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.

Similar News

News April 9, 2026

75% పోలింగ్.. అదరగొడుతున్న అస్సాం ఓటర్లు!

image

అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అస్సాంలో 75.91% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కేరళంలో 62.71%, పుదుచ్చేరిలో 72.40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్‌లోకి ఎంట్రీ ఉంది. కాగా 2021 ఎన్నికల్లో అస్సాంలో 82.42%, కేరళంలో 74.06%, పుదుచ్చేరిలో 83.42% పోలింగ్ నమోదైంది.

News April 9, 2026

సైంధవుడిలా అడ్డుకోవడమంటే?

image

ఎవరైనా ఓ పనిని ముందుకు సాగనీయకపోతే సైంధవుడిలా అడ్డుకున్నాడని అంటాం. దుర్యోధనుడి సోదరి దుస్సల భర్తే సైంధవుడు(జయద్రథుడు). వనవాసంలో ద్రౌపదిని అతను అవమానిస్తే భీముడు చావగొడతారు. ఆ పగతో తపస్సు చేసి ఒక్కరోజైనా పాండవులను అడ్డగించేలా శివుడిని వరం కోరతారు. అర్జునుడిని మినహాయించి ఈశ్వరుడు ఈ వరమిస్తారు. యుద్ధంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్లాక ఇతర పాండవులు అనుసరించకుండా సైంధవుడు అడ్డుపడతారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 9, 2026

మావిగన్ జోకర్‌గా జగన్: షర్మిల

image

AP: YCP చీఫ్ <<19603764>>జగన్<<>> YSR పేరును వాడుకున్నారే తప్ప ఆయన ఆశయాలకు వారసులు కాలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘‘దేశంలో క్రిస్టియన్ మైనారిటీలపై దాడులు జరుగుతుంటే YSR వారసుడుగా జగన్ ఎందుకు ఖండించలేదు? 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా మిగిలారు. మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి ‘ఓన్లీ క్యాష్’ మాఫియా ఎందుకు చేశారు’’ అని నిలదీశారు.