News April 24, 2024

KCR పాలనలో పాలమూరుకు అన్యాయం: రేవంత్

image

TG: కేసీఆర్ హయాంలో పాలమూరు గడ్డకు చాలా అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లిలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో మాట్లాడిన ఆయన.. ‘కరీంనగర్‌లో ఓటమి భయంతో కేసీఆర్ పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి జిల్లాకు అన్యాయం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కరవు జిల్లాను కనీసం పట్టించుకోలేదు’ అని ఫైరయ్యారు.

Similar News

News November 9, 2025

జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అటు అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ఈ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి వివరాలు వెల్లడి కాలేదు.

News November 9, 2025

ష్.. ఊపిరి పీల్చుకో..!

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార పర్వం ముగిసింది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతల గొంతులు సైలెంట్ అయ్యాయి. ఎన్నికల 48గం. ముందు సైలెన్స్ పీరియడ్ రూల్‌తో జూబ్లీహిల్స్ ప్రస్తుతం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. విమర్శలు, సవాళ్లు, సెంటిమెంట్లు, డెవలప్మెంట్లు సహా ఎన్నో విన్న ప్రజాస్వామ్య దేవుళ్లు ఈ నెల 11న తమ తలరాత రాసుకోనున్నారు. అటు బిహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది.

News November 9, 2025

డెడ్ బాడీలో రక్త ప్రసరణ.. డాక్టర్ల అరుదైన ఘనత

image

ఢిల్లీలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రక్రియలో విజయం సాధించారు. పక్షవాతంతో చనిపోయిన గీతా చావ్లా(55) అనే మహిళ శరీరంలో రక్తప్రసరణను తిరిగి ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఇందుకోసం ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్(ECMO)ను ఉపయోగించారు. తర్వాత ఆమె కాలేయం, మూత్రపిండాలను సేకరించి ఇతరులకు విజయవంతంగా అమర్చారు. ఇలా చేయడం ఆసియాలోనే తొలిసారి అని ఆస్పత్రి ఛైర్మన్ శ్రీనివాసన్ తెలిపారు.