News November 13, 2024

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: సీఎం రేవంత్

image

జనాభాను నియంత్రించిన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని CM రేవంత్ అన్నారు. ‘దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశానికి ఒక రూపాయి పోతే కేంద్రం నుంచి 40 పైసలు మాత్రమే వస్తుంది. బిహార్ ఒక రూపాయి ఇస్తే రూ.7.06 వస్తుంది. 2025 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు 800 ఎంపీ సీట్లు వస్తాయి. సౌత్‌లో 123కి తగ్గిపోతాయి. దీంతో కేంద్రంలో సౌత్ పాత్ర తగ్గిపోతుంది’ అని IE ప్రోగ్రాంలో చెప్పారు.

Similar News

News December 6, 2025

‘రీపర్ హార్వెస్టర్’తో పంట కోత మరింత సులభం

image

వ్యవసాయంలో యాంత్రీకరణ అన్నదాతకు ఎంతో మేలు చేస్తోంది. పంట కోత సమయంలో కూలీల కొరతను అధిగమించడానికి మార్కెట్‌లో అనేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘రీపర్ హార్వెస్టర్’. ఈ యంత్రంతో వరి, గోధుమ, సోయాబీన్ ఇతర ధాన్యాల పంటలను సులభంగా కోయవచ్చు. డైరీ ఫామ్ నిర్వాహకులు కూడా సూపర్ నేపియర్ గడ్డిని కట్ చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. వీటిలో కొన్ని ధాన్యాన్ని కోసి కట్టలుగా కూడా కడతాయి.

News December 6, 2025

పంచాయతీ పోరు.. ఖర్చుల లెక్క చెప్పకుంటే అనర్హత వేటు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ఫలితాల తర్వాత 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలను ECకి తప్పనిసరిగా సమర్పించాలి. లేదంటే అనర్హత వేటు పడుతుంది. వేటు పడితే మూడేళ్లపాటు ఏ ఎన్నికలో పోటీ చేయరాదు. గెలిచిన వారు లెక్కలు చెప్పకపోతే పదవి నుంచి తొలగిస్తారు. 5 వేలకు పైగా ఓటర్లు ఉన్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు ₹2.50L, వార్డ్ మెంబర్లు ₹50K వరకు ఖర్చు చేయవచ్చు

News December 6, 2025

మీ పిల్లలు చేసే ఈ పనులను సరిదిద్దండి

image

పిల్లలు చేసే కొన్ని పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అవే భవిష్యత్‌లో సమస్యలుగా మారే ప్రమాదముంది. పెద్దలు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం, ఏదైనా షేర్ చేసుకోకుండా మొండిగా ఉండటం, అబద్ధాలు చెప్పడం, దుకాణాల్లో మారాం చేయడం.. ఇవన్నీ చిన్న వయసులోనే మార్చాల్సిన అలవాట్లు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, మాట వినకపోవడం వంటి ప్రవర్తనలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మృదువైన హెచ్చరికతో పిల్లలను సరిదిద్దాలి.