News November 19, 2024
‘కాళేశ్వరం’పై విచారణ.. ఈనెలాఖరున KCRకు పిలుపు!

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్కుమార్, రజత్కుమార్, స్మితా సబర్వాల్, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
Similar News
News November 22, 2025
ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News November 22, 2025
మహిళలు ఎక్కువ గంటలు పని చేస్తే?

కెరీర్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఎక్కువ గంటలు పనిచేసే మహిళలకు ఒత్తిడి, ఆందోళన పెరిగి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం జరగడం, ప్రీమెచ్యూర్ బేబీ, ఎదుగుదల లోపాలు, ప్రీఎక్లాంప్సీయా ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గినా.. ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు.


