News September 14, 2024
INSPIRATION: ఒకప్పుడు గిన్నెలు కడిగి.. ఇప్పుడు ఎమ్మీ హోస్ట్గా..

ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ను హోస్ట్ చేయనున్న ఫస్ట్ ఇండియన్గా అవతరించారు. డెహ్రాడూన్లో పుట్టిన వీర్ దాస్ USలో చదివేటప్పుడు ఖర్చుల కోసం వీధుల్లో గిటార్ వాయించేవారు. డిష్ వాషర్, డోర్మ్యాన్గానూ చేశారు. డబ్బుల్లేక ATM సెంటర్ల ముందు నిల్చొని కన్నీళ్లు పెట్టుకునేవారు. దాదాపు 20ఏళ్లకు ఎమ్మీ అవార్డ్స్ను హోస్ట్ ఛాన్స్ కొట్టేసి నిజమైన టాలెంట్ను ఎవరూ ఆపలేరని నిరూపించారు.
Similar News
News January 25, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
ఇవాళ సూర్య జయంతి.. ‘రథ సప్తమి’ అని ఎందుకంటారు?

కశ్యప మహాముని కుమారుడు సూర్యుడి జయంతి నేడు. అయితే ‘రథ సప్తమి’గా ప్రాముఖ్యం చెందింది. దానికి కారణం.. ఇవాళ ఆదిత్యుడు 7గుర్రాల రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణిస్తాడని భక్తులు నమ్ముతారు. మాఘ సప్తమి(నేడు) నుంచి 6నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపంగా సూర్యుడు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తారని విశ్వసిస్తారు.
News January 25, 2026
తిరుమల గిరుల్లో రథసప్తమి శోభ

AP: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5:30 గంటలకే మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


