News September 3, 2025
INSPIRING: 37 ఏళ్లపాటు నిస్వార్థ సేవ❤️

దేశ సేవ కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఎంతో మంది మహానుభావులు మనకు స్ఫూర్తినిస్తుంటారు. వారిలో బ్రిగేడియర్ గిడుగు హిమశ్రీ ఒకరు. 1988లో ఇండియన్ ఆర్మీలో చేరిన ఆమె 37ఏళ్లపాటు వివిధ ర్యాంకుల్లో సేవలందించారు. అరుణాచల్ అడవుల నుంచి సియాచిన్ మంచు శిఖరాల వరకు అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ మెడికల్ యూనిట్లకు నాయకత్వం వహించారు. సోమాలియా వంటి సంఘర్షణ ప్రాంతాలలోనూ ఆమె అచంచలమైన ధైర్యాన్ని, దేశభక్తిని ప్రదర్శించారు.
Similar News
News September 5, 2025
టారిఫ్స్తో USకు రూ.లక్షల కోట్ల ఆదాయం!

వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్తో భారీగా ఆదాయం వస్తున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్లు(₹2.73 లక్షల కోట్లు) వచ్చినట్లు తెలిపింది. టారిఫ్స్ అమల్లోకి వచ్చాక APRలో $17.4b, మేలో $23.9b, JUNలో $28b, JULలో $29b వచ్చాయంది. ఈ ఏడాది ఇప్పటివరకు $158b ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే 2.5 రెట్లు అధికమని పేర్కొంది. INDపై 50% టారిఫ్స్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
News September 5, 2025
యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

AP: రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్- NTR వైద్య సేవ కింద <<17610266>>హెల్త్ పాలసీ<<>> ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పాలసీ కింద..
* EHS వర్తించేవారికి కాకుండా మిగతావారికి వైద్యసేవలు
* జర్నలిస్టుల కుటుంబాలకూ వర్తింపు
* తొలుత ఆస్పత్రి ఖర్చులు బీమా కంపెనీలు చెల్లించనుండగా, ఆపై ప్రభుత్వం వాటికి అందిస్తుంది.
* ఖర్చులను 15రోజుల్లోగా చెల్లించాలని నిర్ణయం
* RFP విధానంలో రోగి చేరిన 6గంటల్లో అప్రూవల్.
News September 5, 2025
ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.