News May 12, 2024
సత్యకుమార్పై దూషణలు.. YCP ఎమ్మెల్యేపై కేసు

AP: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 153 ,188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 26, 2025
‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.
News November 26, 2025
రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ స్పందిస్తారా?: కేటీఆర్

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల <<18387531>>తగ్గింపు<<>>, డబ్బు దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని రాహుల్ గొప్పగా చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రూ.160 కోట్లు ఖర్చు చేశారు. తీరా చూస్తే 24 నుంచి 17 శాతానికి తగ్గించారు. దీనిపై రాహుల్ స్పందించే అవకాశం ఉందా?’ అని ట్వీట్ చేశారు.
News November 26, 2025
2027కు 30 డాలర్లకు ముడిచమురు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?

వచ్చే రెండేళ్లలో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు సరఫరా భారీగా పెరగనుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. OPEC+(పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య), non-OPEC దేశాలు గణనీయంగా ఉత్పత్తిని పెంచడమే కారణమని తెలిపింది. దీంతో ప్రస్తుతం $60గా ఉన్న బ్యారెల్ ధర FY2027 చివరికి $30కు పడిపోవచ్చని వెల్లడించింది. దీనివల్ల అతిపెద్ద దిగుమతిదారైన INDకు భారీ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పెట్రోల్ రేట్లు తగ్గొచ్చని నిపుణుల అంచనా.


