News June 24, 2024
తీవ్రత ముగుస్తోంది కానీ యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్

గాజాలో తీవ్ర స్థాయి పోరాటం ముగింపు దశకు వస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే ఆ భూభాగంపై హమాస్ పట్టు కోల్పోయేవరకు యుద్ధం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. లెబనాన్తో ఉన్న ఉత్తర సరిహద్దు వెంబడి మున్ముందు మరిన్ని బలగాలను మోహరిస్తామని పేర్కొన్నారు. హమాస్ బందీలుగా ఉన్న తమ పౌరులను ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకొచ్చి తీరతామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 3, 2026
ఇండియన్ టెక్నాలజీతోనే హైస్పీడ్ రైళ్లు: నిర్మలా సీతారామన్

దేశంలో రాబోయే హైస్పీడ్ రైలు నెట్వర్క్ పూర్తిగా దేశీయ టెక్నాలజీతోనే సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ బుల్లెట్ తరహా రైళ్లు ఇండియన్ టెక్నాలజీతో, మేడ్ ఇన్ ఇండియా కోచ్లతోనే పట్టాలెక్కుతాయని బడ్జెట్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబై-పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై సహా మొత్తం 7 కారిడార్లను బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
News February 3, 2026
బలహీన పోలింగ్ బూత్లపై TDP ప్రత్యేక దృష్టి

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.
News February 3, 2026
ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు

☛ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్బర్గ్ మరణం
☛ 1924: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.
☛ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
☛ 1963: RBI 23వ గవర్నర్ రఘురాం రాజన్ జననం
☛ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
☛ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం


