News April 22, 2025
Inter ఫలితాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ర్యాంకులివే

ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 69.94 శాతం సాధించి 4వ స్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 62.45 శాతం సాధించి 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో ఖమ్మం 76.81 శాతం సాధించి 5వ స్థానం, భద్రాద్రి కొత్తగూడెం 72.43 శాతంతో 9వ స్థానంలో నిలిచింది.
Similar News
News April 22, 2025
ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి

J&k పహల్గామ్లో ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు వదిలాడు. భార్యాపిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
News April 22, 2025
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్

AP: YCP నేత, MLC దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ CM, ఆ పార్టీ అధినేత YS జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News April 22, 2025
దిగజారుతున్న పంత్ ప్రదర్శన.. ఫ్యాన్స్ ఫైర్

IPL: LSG కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శన రోజురోజుకూ దిగజారుతోంది. ఇవాళ DC మ్యాచ్లో చివర్లో వచ్చి డకౌట్ కాగా, ఆ జట్టు ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇస్తే, ఇలాగేనా ఆడేది? అంటూ మండిపడుతున్నారు. పంత్ ఈ ఏడాది లీగ్లో 8 ఇన్నింగ్స్లలో ఒకే ఒక అర్ధశతకం(63) చేశారు. రెండు సార్లు డకౌట్ అయ్యారు. కేవలం 13.25 యావరేజ్, 96.36 స్ట్రైక్రేట్తో పేలవంగా ఆడుతున్నారు.