News February 13, 2025
ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక

TG: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టొద్దని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు సూచించింది. ఒకవేళ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టినట్లు కొన్ని కాలేజీలపై ఫిర్యాదు వచ్చాయని అధికారులు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని విద్యార్థులకు సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను https://tgbie.cgg.gov.in/ <
Similar News
News January 7, 2026
టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నిధులు విడుదల

TG: పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23కోట్ల నిధులను విడుదల చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు వీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.
News January 7, 2026
మౌలానా వర్సిటీ భూములు వెనక్కి తీసుకుంటే ఉద్యమమే: సంజయ్

TG: HYDలోని మౌలానా ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘వీటిని అమ్మి దోచుకోవాలని చూస్తున్నారు. సల్కం చెరువును ఆక్రమించి విద్యా వ్యాపారం చేస్తున్న ఒవైసీపై చర్యలేవి? వాటిని ఎందుకు తీసుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు. GOVT తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా వర్సిటీలో వినియోగించని 50 ఎకరాల స్వాధీనానికి గతనెల కలెక్టర్ నోటీసులిచ్చారు.
News January 7, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


