News April 1, 2025
నేటి నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం

AP: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు క్లాసులు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెకండియర్ విద్యార్థులకు నేటి నుంచే క్లాసులు జరగనుండగా ఈనెల 7 నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఎంబైపీసీ అనే కొత్త కోర్సును కూడా ప్రవేశపెడుతున్నారు.
Similar News
News April 2, 2025
గెలిచినా, ఓడినా ఒకేలా ఉండండి.. LSG ఓనర్కు నెటిజన్ల క్లాస్!

నిన్నటి మ్యాచ్లో PBKSపై LSG ఓడిపోవడంతో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్పై సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న మ్యాచ్ గెలిచినప్పుడు ఈయనే పంత్కు సెల్యూట్ చేస్తూ, హత్తుకుంటూ అభినందించారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తించడంపై విమర్శలొస్తున్నాయి. ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఓటమిలో ప్లేయర్లకు అండగా ఉండి వారిని ఎంకరేజ్ చేయాలని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
News April 2, 2025
SAD: విధుల్లో చివరి రోజే జీవితంలోనూ ఆఖరి రోజైంది!

ఆ లోకో పైలట్కి విధుల్లో అదే ఆఖరి రోజు. ‘త్వరగా వచ్చేస్తాను.. అందరం డిన్నర్కి వెళ్దాం’ అని కుటుంబానికి మాట ఇచ్చారు. కానీ విధుల్లో చివరి రోజే జీవితంలోనూ ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయారు. నిన్న ఝార్ఖండ్లో గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్కు చెందిన గంగేశ్వర్ మాల్ కన్నుమూశారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు నాన్నా అంటూ ఆయన కుమార్తె గుండెలవిసేలా రోదిస్తున్నారు.
News April 2, 2025
ఐసీసీ ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించాడు!

NZ బౌలర్ డఫీ ICC T20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారు. ఈక్రమంలో ఆ దేశం తరఫున ఏ ఫార్మాట్లోనైనా అగ్రస్థానం దక్కించుకున్న తొలి ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టించారు. బౌలర్లలో వరుణ్ 3వస్థానంలో, ఆల్రౌండర్లలో పాండ్య అగ్రస్థానంలో నిలిచారు. భారత ఆటగాళ్ల ర్యాంకులు చూస్తే..
T20 Batting: అభిషేక్-2, తిలక్-4, సూర్య-5
ODI Batting: గిల్-1, రోహిత్-3, కోహ్లీ-5, శ్రేయర్-8
ODI Bowling: కుల్దీప్-3, జడేజా-9