News October 2, 2024
ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికెట్లు

AP: వరదల కారణంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి ఇంటర్మీడియట్ విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారందరికీ డూప్లికేట్ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరదలకు ఇళ్లు నీట మునగడంతో చాలా మంది సర్టిఫికెట్లు తడిచి పాడైపోయాయి. దీంతో ఎలాంటి ఫీజు లేకుండా డూప్లికేట్ పత్రాలు ఇవ్వనుంది.
Similar News
News December 11, 2025
అల్లూరి జిల్లాలో వింత..!

అల్లూరి జిల్లా ఎం.భీమవరం పంచాయతీ కొత్తూరులో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగేశ్వరావు అనే రైతు సాగు చేస్తున్న మొక్కజొన్నకు 16 పొత్తులు వచ్చి అబ్బురపరుస్తున్నాయి. ఈ మొక్కను చుట్టు పక్కల వారు వింతగా చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇన్ని పొత్తులు చూడలేదని.. రెండు లేదా మూడు మాత్రమే వచ్చేవని చెప్పారు. విత్తనంలో జన్యు పరమైన లోపంతో ఇలా వస్తాయని హార్టికల్చర్ అధికారులు అంటున్నారు.
News December 11, 2025
ట్రంప్ గోల్డ్ కార్డ్.. US పౌరసత్వానికి రాజమార్గం

US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘<<18527355>>గోల్డ్ కార్డ్<<>>’ హాట్టాపిక్గా మారింది. ఈ స్కీమ్ ద్వారా అత్యంత వేగంగా ఆ దేశ పౌరసత్వం పొందచ్చు. భారీగా డబ్బులు ఇచ్చే వ్యక్తులు, కంపెనీలకు లీగల్ స్టేటస్, పౌరసత్వం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అప్లై చేస్తే $1M, కంపెనీలు స్పాన్సర్ చేస్తే $2M చెల్లించాలి. దీంతో పాటు DHS ఫీజు $15,000 కట్టాలి. అదే గ్రీన్ కార్డు కావాలంటే ఏళ్లపాటు నిరీక్షణ, కఠిన నిబంధనలు ఉంటాయి.
News December 11, 2025
ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.


