News October 2, 2024
ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికెట్లు

AP: వరదల కారణంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి ఇంటర్మీడియట్ విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారందరికీ డూప్లికేట్ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరదలకు ఇళ్లు నీట మునగడంతో చాలా మంది సర్టిఫికెట్లు తడిచి పాడైపోయాయి. దీంతో ఎలాంటి ఫీజు లేకుండా డూప్లికేట్ పత్రాలు ఇవ్వనుంది.
Similar News
News February 8, 2026
ప్రభుత్వ సంస్థల్లో టీ ఫైబర్ మాత్రమే వాడాలని ఆదేశాలు

TG: ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలన్నీ టీ ఫైబర్ ఇంటర్నెట్ వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల ఇంటర్నెట్ వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,484 సంస్థలు టీ ఫైబర్ను వినియోగిస్తున్నాయి. 26 జిల్లాల్లోని 8,895 గ్రామపంచాయతీలకు ఈ నెట్వర్క్ విస్తరించింది. ఈ సేవలకు వన్ టైం పేమెంట్ రూ.9500 చెల్లించాలి.
News February 8, 2026
అత్తారింటికి ఏ రోజు వెళ్లకూడదంటే?

వారాల నియమాల ప్రకారం కుటుంబ సౌభాగ్యం కోసం కొన్ని ఆచారాలున్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు కాబట్టి, ఆ రోజున ఆడపిల్లలను ఇంటి నుంచి పంపకూడదు. దీన్ని ఇంటి లక్ష్మిని బయటకు పంపినట్టు భావిస్తారు. మంగళవారం ఉద్వేగాలకు, కలహాలకు సంకేతం. ఈ రోజున వివాహిత అత్తగారింటికి వెళ్తే గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుందని శాస్త్ర వచనం. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని పెద్దల నమ్మకం.
News February 8, 2026
జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.


