News October 2, 2024
ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికెట్లు

AP: వరదల కారణంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి ఇంటర్మీడియట్ విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారందరికీ డూప్లికేట్ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరదలకు ఇళ్లు నీట మునగడంతో చాలా మంది సర్టిఫికెట్లు తడిచి పాడైపోయాయి. దీంతో ఎలాంటి ఫీజు లేకుండా డూప్లికేట్ పత్రాలు ఇవ్వనుంది.
Similar News
News February 10, 2026
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఎన్నిక వాయిదా

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప మృతితో అక్కడి ఎన్నికను SEC వాయిదా చేసింది. మరో తేదీపై త్వరలో ప్రకటన చేయనుంది. కాగా రేపు పోలింగ్ జరగాల్సి ఉండగా నిన్న రాత్రి ఆయన <<19098651>>సూసైడ్<<>> చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News February 10, 2026
చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.
News February 10, 2026
స్పీకర్పై అవిశ్వాసం.. మద్దతుకు టీఎంసీ నిరాకరణ?

లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు 100 మందికి పైగా విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ఆ నోటీసును లోక్సభ సెక్రటరీ జనరల్కు అందజేయనున్నారు.


