News March 3, 2025
ఇంటర్ ఎగ్జామ్స్.. 5min లేటుగా వచ్చినా అనుమతి

TG: ఎల్లుండి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షల కోసం 1,532 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఉ.9-మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని, 8.45amలోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9am తర్వాత 5min లేటుగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News December 11, 2025
సూపర్ నేపియర్ గడ్డి పెంపకానికి సూచనలు

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.
News December 11, 2025
సెన్సార్ బోర్డుపై నటుడి కామెంట్స్.. సారీ చెప్పిన మేకర్స్

‘మోగ్లీ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో విలన్ పాత్రలో నటించిన బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన పర్ఫార్మెన్స్ చూసి సెన్సార్ బోర్డు అధికారి భయపడటంతోనే ‘A’ సర్టిఫికెట్ వచ్చిందని ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నిర్మాణసంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ X వేదికగా స్పందించింది. నటుడు నోరు జారడంపై సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెబుతూ, ఆ ఫుటేజీని తొలగిస్తామని ప్రకటించింది. అటు సరోజ్ కూడా సారీ చెప్పారు.
News December 11, 2025
తీవ్ర ఉత్కంఠ.. ఒక్క ఓటుతో గెలిచారు

TG: కామారెడ్డి(D) రాజంపేట(M) నడిమితండాలో సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ ఒక్క ఓటుతో గెలుపొందారు. సూర్యాపేట(D) తిరుమలగిరి(M) మర్రికుంట తండాలోనూ INC బలపరిచిన బానోత్ రోజా ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు. యాదాద్రి జిల్లాలోని 2 గ్రామాల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా ద్వారా ఫలితం తేల్చారు. పారుపల్లిలో కవిత, లక్ష్మక్కపల్లిలో రాజయ్య గెలుపొందారు.


