News March 3, 2025

ఇంటర్ ఎగ్జామ్స్.. 5min లేటుగా వచ్చినా అనుమతి

image

TG: ఎల్లుండి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షల కోసం 1,532 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఉ.9-మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని, 8.45amలోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9am తర్వాత 5min లేటుగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

Similar News

News December 13, 2025

రానున్న 3 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మెదక్‌ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

News December 13, 2025

మన పూర్వ జన్మ సుకృతాలేంటో తెలుసా?

image

ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!!
ఈ శ్లోకం ప్రకారం.. మన జీవితంలో వచ్చే పశువులు, భార్య, కొడుకులు, ఇల్లు.. ఇవన్నీ మన పూర్వ జన్మ సుకృతాలను బట్టి ఏర్పడుతాయి. ఇది కేవలం రుణాబంధం మాత్రమే. రుణం తీరిపోగానే వారు మనల్ని వదిలి వెళ్లిపోతారు. మన అనుకున్నవన్నీ మనకు దూరమవుతాయి. ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మంచి జరిగినా, చెడు జరిగినా మనం బాధ పడకుండా జీవించగలము.

News December 13, 2025

అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు

image

AP: WC గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ దీపిక తన ఊరికి రోడ్డు లేదని నిన్న Dy.CM పవన్‌ను కలిసినప్పుడు తెలిపారు. శ్రీసత్యసాయి(D) హేమావతి-తంబలహెట్టి వరకు రోడ్డుకు రూ.3.2CR, గున్నేహళ్లి-తంబలహెట్టి రోడ్డుకు రూ.3CR అవసరమని అధికారులు అంచనా రూపొందించగా, పర్మిషన్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. సాయంత్రానికి జిల్లా కలెక్టర్ పాలనపరమైన అనుమతులిచ్చారు. మరోవైపు జట్టుకు పవన్ రూ.84లక్షల ప్రోత్సాహకం అందించారు.