News September 6, 2024

వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్: కేంద్రం

image

ఏపీ, తెలంగాణలో వరద నష్టం అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. TGలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 ఎయిర్‌పోర్స్ హెలికాప్టర్లు, ఏపీలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 ఎయిర్‌ఫోర్స్, 2 నేవీ హెలికాప్టర్లు, డోర్నియల్ ఎయిర్‌క్రాఫ్ట్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇండియన్ ఆర్మీ విజయవాడలోని బుడమేరు వాగు గండ్లు పూడుస్తోంది.

Similar News

News November 24, 2025

314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

image

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.

News November 24, 2025

ధర్మేంద్ర ఆస్తి ఎంతో తెలుసా?

image

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరిగా వెలుగొందిన ధర్మేంద్ర అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన ఆస్తి విలువ రూ.335-450 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. సినిమాలు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా ఇంత మొత్తం ఆర్జించినట్లు తెలిపింది. ముంబై-పుణె మధ్యలో ఉండే లోనావాలాలో 100 ఎకరాల ఫాంహౌజ్ ఉందని పేర్కొంది. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లో ఎక్కువగా ఈ ఫౌంహౌజ్‌లో చేసే వ్యవసాయం వీడియోలను పోస్ట్ చేయడం గమనార్హం.

News November 24, 2025

గులాబీ తోటల్లో చీడపీడల ముప్పు

image

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్‌ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.