News April 22, 2025
INTER RESULT: నిజామాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 17,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,258 మంది పాసయ్యారు. 51.88% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్లో 15,987 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 9,348 మంది పాసయ్యారు. 58.47% ఉతీర్ణత సాధించారు.
Similar News
News April 23, 2025
NZB: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్ను సంప్రదించగలరు.
News April 23, 2025
NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

తల్లి క్యాన్సర్తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్తో పడపడుతుంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.
News April 23, 2025
NZB: వడదెబ్బ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

వాతావరణ మార్పులు-ప్రభావం వడదెబ్బపై పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతులమీదుగా ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు దాని ప్రభావం వడదెబ్బ నుంచి రక్షించుకుందాం అనే పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ అంకిత్తో కలిసి ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్రమైన వేడితో కూడిన ఎండలు ఉన్నందున ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.