News April 22, 2025

INTER RESULTS.. హనుమకొండలో ఎంత మంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో హనుమకొండ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 18,479 మంది పరీక్షలు రాయగా 13,601 మంది ఉత్తీర్ణత సాధించారు. 73.60 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 19,543 మంది విద్యార్థులకు 13,601 మంది ఉత్తీర్ణులు కాగా.. 69.60 పాస్ పర్సంటేజీ నమోదైంది.

Similar News

News April 23, 2025

MNCL: RPల నియామకానికి దరఖాస్తులు: DEO

image

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో సబ్జెక్ట్, జిల్లా రిసోర్స్ పర్సన్స్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, హెచ్ఎంకు ఈ నెల 24 లోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎంపికైన ఉపాధ్యాయుల వివరాలు 28న ప్రకటిస్తామన్నారు. ఏమనా సందేహాలు ఉంటే క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తిని 8985209588 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

News April 23, 2025

ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

image

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.

News April 23, 2025

శ్రీరాంపూర్: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు

image

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. అర్హత కలిగిన ఉద్యోగుల ఉన్నత చదువుకు ఇప్పటి వరకు యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహక నగదు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివిధ పోటీ పరీక్షల్లో 2 వేలలోపు ర్యాంకు సాధించిన 57 మందికి అందిస్తున్న రూ.10 వేలు మెరిట్ స్కాలర్ షిప్‌ను రూ.16 వేలకు పెంచింది. అలాగే ర్యాంక్ పరిమితి 2 వేలు లోపు నుంచి 8 వేలకు అవకాశం కల్పించారు.

error: Content is protected !!