News April 22, 2025
Inter Results: సిద్దిపేట జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 9217 మంది పరీక్షలు రాయగా 5490 మంది ఉత్తీర్ణతతో 59.56 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్లో 9791 మందికి 5042 మంది పాసయ్యారు. 51.50 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.
Similar News
News February 10, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం

నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన యానాది గజేంద్ర (31) ప్రమాదవశాత్తు బావిలోకి దిగి మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన మున్నెప్ప వ్యవసాయ బావిలోకి మోటర్ మరమ్మతుకై దిగుతుండగా గజేంద్ర కాలుజారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 10, 2026
కరీంనగర్: పోలింగ్ వేళ.. అభ్యర్థుల్లో ఉత్కంఠ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. బహిరంగ సభలు, ర్యాలీలు ముగియడంతో సమరం ఇళ్ల ముంగిటకు మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు డోర్ టూ డోర్ వ్యూహాలు, డిజిటల్ ప్రచారంతో అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తాయిళాల పంపిణీ ఊపందుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడటంతో అభ్యర్థుల్లో గెలుపోటముల టెన్షన్ పెరుగుతోంది.
News February 10, 2026
కొడంగల్కు సీఎం రేవంత్

TG: CM రేవంత్ రేపు కొడంగల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30గం.కు కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం HYDకు తిరిగి పయనమవుతారు. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 8,203 కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను EC సిద్ధం చేసింది. మొత్తం 12,930మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


