News April 22, 2025

Inter రిజల్ట్స్: ఎంత మంది పాసయ్యారంటే?

image

TG: ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్‌ రెగ్యులర్‌లో 66.89%, వొకేషనల్‌లో 57.68% మంది పాసైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్ 71.37%, వొకేషనల్‌లో 67.44% విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. మొదటి సంవత్సరంలో బాలికల్లో 73.83, బాలురులో 57.83 శాతం పాసవ్వగా, ద్వితీయ సంవత్సరంలో బాలికల్లో 74.21, బాలురులో 57.31 శాతం మంది పాసయ్యారని వెల్లడించారు.

Similar News

News August 6, 2025

ప్రకటనలు, సంక్షేమ పథకాల్లో CM ఫొటో ఉండొచ్చు: సుప్రీం తీర్పు

image

సంక్షేమ పథకాల్లో CMల పేర్లు, ఫొటోలు వాడొద్దన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. CM ఫొటో వాడుకోవచ్చని CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సంక్షేమ పథకాలకు CM పేరు, ఫొటోలు వాడటంపై AIDMK హైకోర్టును ఆశ్రయించగా వాడొద్దని తీర్పు వచ్చింది. దీనిని TN GOVT SCలో సవాల్ చేయడంతో పైవిధంగా తీర్పు ఇచ్చింది. రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దని AIDMK నేతకు రూ.10లక్షల ఫైన్ వేసింది.

News August 6, 2025

యూపీఐ ఎప్పటికీ ఉచితమని చెప్పలేదు: RBI గవర్నర్

image

యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. ‘యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ సబ్సిడీల రూపంలో ప్రభుత్వమే వాటిని భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వ పాలసీ’ అని పేర్కొన్నారు.

News August 6, 2025

బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు: భట్టి

image

TG: బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రిజర్వేషన్లు సాధిస్తామనే నమ్మకం ఉందని, కేంద్రం త్వరగా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్‌కు అన్ని కులాలు, మతాలు సమానమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల విషయంలో BJP డబుల్ గేమ్ ఆడుతోందని TPCC చీఫ్ మహేశ్ ఫైరయ్యారు.