News April 22, 2025
Inter Results.. నాగర్కర్నూల్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా విద్యార్థులు కాస్త వెనుకంజలో ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో 48.77 శాతం మంది పాసయ్యారు. 6,477 మంది పరీక్షలు రాయగా 3,159 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్లో 63.93 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 5,899 మంది పరీక్షలు రాయగా 3,771 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News April 23, 2025
OU: బీ ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..
News April 22, 2025
ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి

J&k పహల్గామ్లో ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు వదిలాడు. భార్యాపిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
News April 22, 2025
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్

AP: YCP నేత, MLC దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ CM, ఆ పార్టీ అధినేత YS జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.