News December 31, 2024
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

TG: ఖమ్మం(D) మధిర మండలంలోని కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు. అతడి స్వస్థలం ముదిగొండ. సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 15, 2026
మమతకు షాక్.. I-PAC ఆఫీసు సోదాల కేసులో నోటీసులు

I-PAC ఆఫీసులో సోదాల కేసులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ED విధుల్లో జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. CM మమత, రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. I-PAC ఆఫీస్లోని CCTV ఫుటేజీని భద్రపర్చాలని తెలిపింది. ED అధికారులపై నమోదైన FIRపై స్టే విధించింది.
News January 15, 2026
నారా ఫ్యామిలీని చూశారా.. Photo Gallery

AP: సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామదేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖర్జూరపునాయుడు, అమ్మణమ్మ, రామ్మూర్తినాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజస్విని, నారా రోహిత్, సిరి తదితరులు పాల్గొన్నారు.
News January 15, 2026
BISAG-Nలో గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు

భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N)లో 5 గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్, ఎంసీఏ, డిప్లొమా(గ్రాఫిక్స్)అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55,000 వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://bisag-n.gov.in/


