News December 31, 2024

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

image

TG: ఖమ్మం(D) మధిర మండలంలోని కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు. అతడి స్వస్థలం ముదిగొండ. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 30, 2026

కాంగ్రెస్‌లోనే ఉంటా: థరూర్

image

తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లడం లేదని INC MP శశిథరూర్ స్పష్టం చేశారు. కేరళ ఎన్నికల్లో UDFను గెలిపించేందుకు పనిచేస్తానన్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న థరూర్ తాజాగా అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌తో భేటీ అయ్యారు. పార్టీతో విభేదాలు లేవని మీడియాతో పేర్కొన్నారు. ‘నేను చేసిన వ్యాఖ్యలు BJPకి అనుకూలమని కొందరు భావించొచ్చు. కానీ అవి భారత్‌కు అనుకూలం. రాహుల్ నిజాయతీ కల నేత’ అని పేర్కొన్నారు.

News January 30, 2026

ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారుతాయి..

image

ఫిబ్రవరి 1 నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*ఫాస్టాగ్‌ను <<18735050>>యాక్టివేట్<<>> చేసిన తర్వాత అదనంగా KYC/KYV వెరిఫికేషన్ అవసరం లేదు.
*పాన్ మసాలా, <<18730084>>సిగరెట్లు<<>>, పొగాకు ధరలు పెరగనున్నాయి.
*LPG సిలిండర్, CNG, PNG, విమాన ఇంధన ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
*కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పన్ను విధానంలో మార్పులు జరగొచ్చు. ఆదివారమైనా స్టాక్ మార్కెట్ ఓపెన్‌లో ఉంటుంది.

News January 30, 2026

కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

image

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.