News December 31, 2024
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

TG: ఖమ్మం(D) మధిర మండలంలోని కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు. అతడి స్వస్థలం ముదిగొండ. సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 3, 2026
Airtel: ఉచిత AI ఆఫర్ ఇక ఉండదు

ప్రముఖ టెలికం సంస్థ Airtel తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఇస్తున్న ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్ ఆఫర్ను నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసే వినియోగదారులకు Perplexity AI ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉండదని కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వర్తిస్తుందని ముందుగానే తెలిపింది. అయితే ఇప్పటికే ఆఫర్ను క్లెయిమ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ పేర్కొంది.
News February 3, 2026
లోక్సభలో గందరగోళం.. వాయిదా

అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్పై పార్లమెంటులో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో లోక్సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ముందు ఉన్న టేబుల్ ఎక్కి విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లాపైకి పేపర్లు విసిరారు. దీంతో ఆయన సభను గంటపాటు వాయిదా వేశారు. అటు పార్లమెంటు బయట కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
News February 3, 2026
USతో ట్రేడ్ డీల్ వివరాలు బయటపెట్టాలి: INC

IND-US ట్రేడ్ డీల్ గురించి ట్రంపే ప్రకటన చేశారని ప్రధాని మోదీ కాదని కాంగ్రెస్ పేర్కొంది. మోదీ అభ్యర్థన మేరకే ఈ ఒప్పందం జరిగిందని, డీల్లోని వివరాలు వెల్లడించాలని Xలో డిమాండ్ చేసింది. ‘పార్లమెంటును, దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలి. ఒప్పందంలోని కీలకాంశాలు తెలపాలి. యుద్ధ విరమణ ఒప్పందం లాగే, వాణిజ్య ఒప్పంద ప్రకటననూ ట్రంపే చేశారు. మోదీ అభ్యర్థన మేరకే వాణిజ్య ఒప్పందం జరుగుతోంది’ అని పేర్కొంది.


