News August 3, 2024

మహిళలకు వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: రాష్ట్రంలోని మహిళలకు రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో ఆయన పర్యటించారు. మధిర నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీలో 3వ తరగతి వరకు ఏర్పాటు చేసి 4వ తరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు విద్యార్థులను పంపించేలా చేస్తామన్నారు.

Similar News

News November 18, 2025

ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్‌ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

News November 18, 2025

ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్‌ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

News November 18, 2025

భారత్‌కు ప్రతి టెస్టు కీలకమే

image

WTC 2025-27 సీజన్‌లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్‌లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.