News August 3, 2024
మహిళలకు వడ్డీలేని రుణాలు: భట్టి

TG: రాష్ట్రంలోని మహిళలకు రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో ఆయన పర్యటించారు. మధిర నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంగన్వాడీలో 3వ తరగతి వరకు ఏర్పాటు చేసి 4వ తరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు విద్యార్థులను పంపించేలా చేస్తామన్నారు.
Similar News
News April 9, 2026
వరి కొనుగోళ్లు ప్రారంభం.. 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు!

TG: రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్ వరి కొనుగోలు ప్రారంభమైంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా 8,251 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొనుగోలు చేసిన 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది. అలాగే నాణ్యమైన ధాన్యానికి క్వింటాల్పై రూ.500 కూడా వెంటనే అందించనుంది. ఈ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
News April 9, 2026
ఓటేసిన ప్రముఖులు.. PHOTOS

కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. తొలి రెండు గంటల్లో కేరళంలో 16.23, అస్సాంలో 17.87, పుదుచ్చేరిలో 17.71 శాతం పోలింగ్ నమోదైంది. కేరళంలో సీఎం విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, నటులు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటు వేశారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి బైక్పై వచ్చి ఓటేశారు.
News April 9, 2026
రేషన్ కార్డుల రీవెరిఫికేషన్.. అనర్హుల తొలగింపు!

TG: అనర్హులకు రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం PAN, GST నంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేసి టెస్టు చేసినట్లు సమాచారం. దీంతో HYDలోనే 2L మంది ట్యాక్స్పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులున్నట్లు తేలిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 80% వెరిఫికేషన్ పూర్తయినట్లు పేర్కొంటున్నాయి. పూర్తి డేటా రాగానే కార్డులను రద్దు చేస్తామంటున్నాయి.


