News September 24, 2025
వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఏ భాషనైనా ఇట్టే చదివేయొచ్చు!

వాట్సాప్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు ఇతర భాషల్లోని మెసేజ్లను కావాల్సిన భాషల్లోకి అనువదించుకోవచ్చు. దీనికోసం మెసేజ్పై నొక్కి పట్టుకుంటే ట్రాన్స్లేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి ఏ భాషలోకి అనువదించాలో దానిని ఎంచుకోండి. ఆండ్రాయిడ్ యూజర్లు అన్ని మెసేజ్లను ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. *తెలుగు ఇంకా అందుబాటులోకి రాలేదు.
Similar News
News September 24, 2025
బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం వాయిదా

TG: ఈ నెల 28న గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను పర్యాటక శాఖ వాయిదా వేసింది. వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈనెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 50 అడుగులకు పైగా ఎత్తుతో బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు.
News September 24, 2025
చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది: జగన్

AP: కూటమి ప్రభుత్వంపై 15 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. ‘చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయినా బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసేవారు ఎవరూ ఉండరు. YCP హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో యూరియా దొరకట్లేదు. ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి యూరియాను పక్కదారి పట్టిస్తోంది’ అని పార్టీ సమావేశంలో ఆరోపించారు.
News September 24, 2025
రూ.100 లంచం ఆరోపణ.. 39 ఏళ్ల న్యాయ పోరాటం

ఓ తప్పుడు ఆరోపణ రాయ్పుర్కు చెందిన జగేశ్వర్ ప్రసాద్(83) జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసింది. MPSRTCలో బిల్లింగ్ అసిస్టెంట్ జగేశ్వర్ను సహోద్యోగి 1986లో లంచం కేసులో ఇరికించాడు. 1988-1994 వరకు సస్పెన్షన్, తర్వాత సగం జీతంతో బదిలీ చేశారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆ ఒత్తిడితో భార్య చనిపోయింది. ఆఖరికి 39 ఏళ్ల తర్వాత హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది.