News December 24, 2024

అయోధ్యలో సిద్ధమైన అంతర్జాతీయ స్టేడియం

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి రానుంది. అయోధ్య – సుల్తాన్‌పూర్ రహదారిపై ఈ స్టేడియం నిర్మితమైంది. ఇది డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లో భాగమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ స్టేడియంలో 40వేల మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూపీలో గ్రీన్‌పార్క్, లక్నోలోని ఎకానా స్టేడియం ఉన్నాయి.

Similar News

News December 4, 2025

ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు.. బ్యాచిలర్లకు ఫైన్

image

బెంగళూరులో బ్యాచిలర్లకు వింత అనుభవం ఎదురైంది. ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు ఉన్నారని రెసిడెన్షియల్ సొసైటీ ₹5వేల ఫైన్ విధించింది. వారికి బిల్లు కూడా ఇచ్చింది. ‘అతిథులు రాత్రిపూట ఉండేందుకు బ్యాచిలర్లకు అనుమతి లేదని మా సొసైటీలో రూల్ ఉంది. ఫ్యామిలీలకు మాత్రం ఆ రూల్ లేదంట’ అని రెడిట్‌లో ఓ యూజర్ రాసుకొచ్చారు. వారిపై చర్యలు తీసుకోవచ్చా అని యూజర్లను అడిగారు. ఇంకో ఇంటికి మారడం మంచిదని నెటిజన్లు సూచించారు.

News December 4, 2025

179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://cau.ac.in/

News December 4, 2025

దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

image

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.