News June 26, 2024

అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

image

అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ ఇంకా 3G నెట్‌వర్క్ అందుబాటులో ఉండగా 30GB డాటా కోసం 1200 AFNలు చెల్లించాల్సిందే. నిన్న ఆస్ట్రేలియాపై అఫ్గాన్ టీమ్ గెలుపొందడంతో ఆ దేశ రాజధాని కాబూల్‌ నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్న ఫొటోలు వైరలయ్యాయి. వాటిలో ఉన్న ఇంటర్నెట్ ఛార్జీల ప్రకటనతో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఇండియాలోనే బెటర్ అని పోస్టులు పెడుతున్నారు.

Similar News

News December 4, 2025

భారీ జీతంతో ఉద్యోగాలు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>THDC<<>>)లో 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BSc(ఇంజినీరింగ్), బీటెక్, BE, MBBS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: thdc.co.in

News December 4, 2025

తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

image

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 4, 2025

సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.