News July 16, 2024
తెలంగాణ సచివాలయానికి ఇంటర్నెట్ కట్

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రూ.కోట్లలో పెండింగ్ బిల్లులు ఉండటంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలంటూ ‘నిపుణ’ నెట్వర్క్ విజ్ఞప్తి చేసినా చెల్లించకపోవడంతో ఇంటర్నెట్ కట్ చేసినట్లు సమాచారం. దీంతో పలు శాఖల సేవలు నిలిచిపోయాయి.
Similar News
News November 25, 2025
మంచి జరగబోతోంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్గా మారింది.
News November 25, 2025
రూ.7,50,000 ప్రశ్న.. ఆ ప్లేయర్ ఎవరు?

కౌన్ బనేగా కరోడ్పతి(KBC)లో క్రికెట్కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రూ.7,50,000 విలువైన ఈ ప్రశ్నను హోస్ట్ అమితాబ్ పార్టిసిపెంట్ను అడిగారు. ఏ ఆల్రౌండర్ భారత జట్టుకు ఓటమి లేకుండా 36 T20I మ్యాచులకు ప్రాతినిథ్యం వహించారు. పైన ఫొటోలో ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా మీకు హింట్ కావాలంటే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్లో ఆ స్ట్రీక్ ముగిసింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ కామెంట్ చేయండి?


