News January 16, 2025
ఈ ఏడాది 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు

దేశవ్యాప్తంగా 2024లో 88.6Cr ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాదిలో 90Crకు చేరుకుంటుందని ఓ రిపోర్టు వెల్లడించింది. మొత్తం వినియోగదారుల్లో 55%(48.8Cr) గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) తెలిపింది. 98% మంది IND భాషల్లోనే నెట్ను యూజ్ చేశారంది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కంటెంట్ విస్తృతంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజాధరణ లభిస్తోందని పేర్కొంది.
Similar News
News October 28, 2025
పిల్లలకు ఆన్లైన్ లిటరసీ నేర్పిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో పిల్లలు స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే వారికి దీంట్లో ఉండే కష్టనష్టాల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనంటున్నారు నిపుణులు. సోషల్మీడియాపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ఏదైనా పోస్ట్ చేసేముందు ఆలోచించాలని, గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని వారికి చెప్పాలి. ఆ పరిచయాలతోపాటు ఆఫ్లైన్లో దొరికే మానవసంబంధాల ప్రాధాన్యతనూ వారికి వివరించాలంటున్నారు.
News October 28, 2025
తుఫాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు

AP: మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫైట్లు నిలిచిపోనున్నాయి. అయితే ఇండిగో ఫైట్లు 10.45AM వరకు, ఢిల్లీ-VJA సర్వీసులు నడుస్తాయని VJA ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అటు ఢిల్లీ, భువనేశ్వర్, VJA, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు వెళ్లే సర్వీసులన్నీ ఆగిపోనున్నాయి.
News October 28, 2025
ప్రతి ఊర్లో హనుమాన్ ఆలయం ఎందుకు ఉంటుంది?

హనుమంతుడు అపారమైన శక్తి, ధైర్యం, నిస్వార్థ భక్తికి ప్రతీక. ప్రజలు ఆయనను కష్టాలను తొలగించే ఆపద్బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా నమ్ముతారు. రాముని సేవలో ఆయన చూపిన నిష్ఠ కారణంగా ఆయన్ని ఎక్కడ పూజించినా రాముని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే గ్రామాన్ని, ప్రజలను రక్షించే రక్షక దేవతగా ప్రతి ఊరిలో ఆయన ఆలయాన్ని నిర్మించడం భారతీయ సంప్రదాయంగా మారింది. ఆయనను పూజిస్తే ధైర్యం, బలం లభిస్తాయని నమ్ముతారు.


