News November 19, 2024

మ‌ణిపుర్ అంశంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్ర‌ప‌తికి ఖ‌ర్గే లేఖ‌

image

మ‌ణిపుర్‌లో ప‌రిస్థితుల్ని చ‌క్క‌దిద్దేందుకు వెంట‌నే జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రప‌తి ద్రౌప‌దీ ముర్ముకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే లేఖ రాశారు. గ‌త 18 నెల‌లుగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో అట్టుడుకుతున్న మ‌ణిపుర్‌లో ఇప్ప‌టికే 300 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించారు. మ‌ణిపుర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలని, ప్ర‌జ‌ల హ‌క్కులు, ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు వెంట‌నే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.

Similar News

News November 13, 2025

కూరగాయల సాగు.. ఎకరాకు రూ.9,600 సబ్సిడీ

image

TG: రాష్ట్రంలో ఏటా 10వేల ఎకరాల మేర కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు ఈ సీజన్ నుంచే ఎకరాకు రూ.9,600 సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అటు పలు రకాల కూరగాయల నారు కూడా సిద్ధం చేసింది. నారు అవసరం ఉన్నవారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. నారు, సబ్సిడీ కావాల్సిన రైతులు సంబంధిత మండలాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News November 13, 2025

శీతాకాలంలో స్కిన్‌ బావుండాలంటే..

image

చలికాలంలో చర్మం ఈజీగా పొడిబారి, పగుళ్లు వస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాలి. గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. చర్మానికి తేమనిచ్చే సబ్బులనే వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News November 13, 2025

ఫ్రీ బస్ పథకం.. ఆర్టీసీకి రూ.7980Cr చెల్లింపు: మంత్రి పొన్నం

image

TG: RTCలో ఇప్పటి వరకు మహిళలు 237కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ప్రభుత్వం RTCకి ₹7980Cr చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. RTC ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల ప్రొవిజనల్ పీరియడ్‌ను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించాలన్నారు.