News September 26, 2024
మల్టీ బ్యాగర్ స్టాక్ కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు

మల్టీ బ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్ సుదర్శన్ ఫార్మా షేరు బుధవారం సెషన్లో 5% పెరిగి ₹424కి చేరింది. సెప్టెంబర్ నెలాఖరులో జరిగే సంస్థ బోర్డ్ మీటింగ్లో స్టాక్ స్ల్పిట్పై చర్చించనుందన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఈ షేరు 3 నెలల్లో 416% ర్యాలీ చేయడమే దీనికి ప్రధాన కారణం. ₹10 ఫేస్ వాల్యూ కలిగిన ఈక్విటీ షేర్లను సబ్-డివిజన్/స్ప్లిట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 2, 2025
నో రిప్లై.. రేపటి నుంచి కాలేజీలు బంద్

TG: ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేపట్టాలని యాజమాన్యాలు తాజాగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. రూ.900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ నెల 4న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని, 6న లక్ష మంది ప్రైవేటు కాలేజీల సిబ్బందితో సభ జరుపుతామని, 10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు.
News November 2, 2025
రేర్ ఎర్త్ మాగ్నెట్స్.. చైనాకు చెక్ పెట్టనున్న భారత్

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో 90% వాటా కలిగిన చైనాకు సవాల్ విసిరేందుకు భారత్ సిద్ధమైంది. దేశీయంగా ఈ రంగంలో ప్రోత్సాహకాలను $290M నుంచి $788Mకు పెంచనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పునరుత్పాదక, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎంతో కీలకం. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.
News November 2, 2025
తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


