News April 25, 2024

ఓటు వేయాలంటూ ఆహ్వాన పత్రికలు

image

ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు నడిపించేందుకు హరియాణా రాష్ట్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇన్విటేషన్ కార్డులను పంపుతోంది. 50 లక్షల కుటుంబాలకు ఆహ్వాన పత్రాలు పంపుతున్నట్లు ఈసీ పేర్కొంది. కాగా హరియాణాలో 10లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 70.36శాతం పోలింగ్ నమోదైంది.

Similar News

News January 27, 2026

రామకృష్ణ తీర్థానికి ఎలా వెళ్లాలంటే..?

image

రామకృష్ణ తీర్థం కేవలం మాఘ పౌర్ణమి నాడు మాత్రమే భక్తుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. భక్తులు తిరుమల బస్టాండ్ నుంచి బస్సులో పాపవినాశనం చేరుకోవాలి. అక్కడి నుంచి దట్టమైన అడవిలో కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులను 5 AM నుంచి 12 PM వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత వెళ్తే పంపించరు. భక్తులకు మార్గమధ్యలో ఆహారం, నీటిని TTD ఉచితంగా అందిస్తుంది. సాయంత్రం లోపు తిరిగి రావడం తప్పనిసరి.

News January 27, 2026

ఎవరు సాక్షి.. ఎవరు దోషి?

image

TG: BRS హయాంలో ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈక్రమంలోనే నాటి కీలక నేతలు హరీశ్ రావు, KTRను విచారించిన సిట్ ఇవాళ సంతోష్ రావును ప్రశ్నించనుంది. 2,3 రోజుల్లో కవితను కూడా విచారిస్తుందని సమాచారం. తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఇప్పటికే ఆమె ఆరోపించారు. అయితే ఇప్పటివరకు పిలిచిన నేతలు సాక్షులా? నిందితులా? అసలు ఈ కేసులో దోషులెవరు? అన్నది ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలు.

News January 27, 2026

అప్పుడే ఎండలు మొదలయ్యాయ్

image

AP: రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం నందిగామలో గరిష్ఠంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరకోస్తాలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడం గమనార్హం.