News June 7, 2024

ఉక్రెయిన్‌కు రావాలని మోదీని ఆహ్వానించా: జెలెన్ స్కీ

image

స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగే శాంతి సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విటర్‌లో తెలిపారు. ఈ సమావేశంలో భారత్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అవకాశం ఉంటే ఉక్రెయిన్‌ను సందర్శించాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో ఈ నెల 15-16న శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు.

Similar News

News January 21, 2026

CEOగా తప్పుకున్న దీపిందర్

image

బ్లింకిట్, జొమాటో ప్లాట్‌ఫామ్స్ పేరెంట్ కంపెనీ ‘ఎటర్నల్’ CEOగా దీపిందర్ గోయల్ తప్పుకోనున్నారు. ఈ Feb 1 నుంచి బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా ఈ బాధ్యతలు చేపట్టనుండగా, గోయల్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. ప్రస్తుత వ్యాపార పరిస్థితులకు తగ్గట్లు కొత్త మార్గాలు అన్వేషించేందుకు, అదే సమయంలో నాయకత్వ స్థాయిలో క్లియర్ ఫోకస్ ఉండేందుకే ఈ మార్పులు అని గోయల్ తెలిపారు.

News January 21, 2026

అమ్మాయిలతో ఎలా మెలగాలో అబ్బాయిలకు క్లాసులు!

image

బ్రిటన్ పాఠశాలల్లో విద్యార్థులకు వినూత్నరీతిలో పాఠాలు బోధిస్తున్నారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మర్యాదగా ప్రవర్తించాలనే అంశాలపై అబ్బాయిలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, బాధ్యతగా మెలగడం వంటి విలువలను నేర్పిస్తే వేధింపులను అరికట్టవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి విధానం ఇండియాలోనూ తీసుకురావాలనే చర్చ జరుగుతోంది.

News January 21, 2026

కర్ణాటక అసెంబ్లీలో ప్రసంగానికి నో చెప్పిన గవర్నర్

image

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రారంభ ఉపన్యాసం చేయడానికి నిరాకరించారు. ఈనెల 22-31వ తేదీ వరకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని ఈరోజు ఉదయం CM సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. నరేగా పథకం పేరు మార్పు, ఉపాధి హామీ చట్టం రక్షణపై చర్చిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.